మైనర్ బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి

by Disha Web Desk 11 |
మైనర్ బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి
X

దిశ, తాండూరు : మంచి చెడు తెలిసి తెలియని ప్రాయంలో ఓ బాలిక అమాయకుడి చేతిలో పడి మూడు నెలల గర్భం దాల్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై కన్నేశాడు.తరచూ బాలికపై అత్యాచారం చేస్తున్నాడంతో గర్భం దాల్చింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది.

బాలికకు జరిగిన అన్యాయం పై ఆ గ్రామానికి చెందిన కుల పెద్దలకు తెలిపారు. నేరానికి పాల్పడిన యువకుడి కుటుంబ సభ్యులతో చర్చించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తమకు న్యాయం చేయాలని మూడు రోజుల క్రితం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నేరానికి పాల్పడిన యువకుడిని పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించినట్లు సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు రోజులు గడుస్తున్నా బాధిత బాలికకు న్యాయం జరగలేదని నేరానికి ఒడిగట్టిన యువకుడిని విచారించి వదిలిపెట్టినట్టు బాలిక తల్లిదండ్రులు,గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.



Next Story

Most Viewed