దిశ ఎఫెక్ట్​...భగీరథ పైప్​ల వద్ద చెత్త తొలగింపు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్​...భగీరథ పైప్​ల వద్ద చెత్త తొలగింపు
X

దిశ,షాబాద్ : మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ షాద్నగర్ చేవెళ్ల రోడ్డు కల్వర్టు కింద నుండి వేశారు. ఈ కల్వర్టు కింద నుండి వాన నీరు చెరువులోకి రావడంతో మురికి నీరంతా మిషన్ భగీరథ పైప్ లీకేజ్ ద్వారా ట్యాంకులకు వెళ్తుంది. దీంతో మురికి నీరు సరఫరా అవుతుంది. ఈ నీరు తాగి ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇక్కడ చెత్త చెదారం వేయడంతో ఈ నీరు మరింత కలుషితమై ప్రజల ప్రాణానికి ముప్పు తెస్తుంది. ఈ వార్త సోమవారం దిశలో ప్రచురితమైంది. దీనికి మిషన్ భగీరథ, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed