- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రామ్ అని పేరు తీసేస్కోని ఆ పేరు పెట్టుకో.. KTRకు రఘునందన్ రావు సెన్సేషనల్ అడ్వైస్
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన సూచన చేశారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో రఘునందన్ రావు మాట్లాడారు. రాముడు, రామ మందిరమే ఎజెండాగా జనంలోకి బీజేపీ నేతలు వెళ్తున్నారని.. ఇంటింటా అక్షింతలు పంచుతున్నారని.. అవి అక్షింతలు కాదు రేషన్ బియ్యం ఇక్కడే కలిపి పంచుతున్నారని ఇటీవల కేటీఆర్ కామెంట్స్ చేశారని యాంకర్ ప్రశ్నించగా.. రఘునందన్ రావు బదులిచ్చారు. రాముడు అందరివాడని రామ మందిర ప్రాణ ప్రతిష్టకు అన్ని మతాల వారు వచ్చారన్నారు. అక్షింతలు పంచిన రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీయే ఉందని.. ఆనాడు రేషన్ బియ్యాన్ని ఒక వేళ అక్షింతలుగా కన్వర్ట్ చేస్తుంటే అధికారంలో ఉన్న మీరు గుడ్డి గాడిదల పండ్లు తోముతున్నారా అని సీరియస్ అయ్యారు. అధికారం కోల్పోవడంతో ఎండలల్లో తిరిగితే ఎండదెబ్బ తగిలినట్లు కేసీఆర్, కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్కు రాముడి పట్ల ఏహ్య భావం ఉంటే వెంటనే తన పేరులోని రామ్ అనే పేరు తీసేస్కొని నాస్తికుడి పేరు పెట్టుకోవాలని అడ్వైస్ ఇచ్చారు. టెలిఫోన్లు విన్న మీకు అక్షింతలు ఎక్కడ కలిపారో పట్టుకోవడం తెలియలేదా అని ఫైర్ అయ్యారు.