యువత ప్రతిరోజూ రన్నింగ్ చేయాలి

by Sridhar Babu |
యువత ప్రతిరోజూ రన్నింగ్ చేయాలి
X

దిశ, కామారెడ్డి : రన్నింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, యువత ప్రతిరోజూ రన్నింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలో 2 కె రన్ ను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ సింధూ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యువత ప్రతిరోజూ ఉదయం రన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె. సారంగపాణి, ట్రెజరర్ రాజేష్, హర్యానా ఆర్గనైజేషన్ రాష్ట్ర పరిశీలకుడు నారాయణ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, ఇతర సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్ లు, మేనేజర్లు, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story