కార్యకర్తల కష్టం, ప్రజల భిక్షతోనే ఎమ్మెల్యే పదవి

by Sridhar Babu |
కార్యకర్తల కష్టం, ప్రజల భిక్షతోనే ఎమ్మెల్యే పదవి
X

దిశ, కామారెడ్డి : బీజేపీ కార్యకర్తల కష్టం, నియోజకవర్గ ప్రజల భిక్ష ఈ ఎమ్మెల్యే పదవి అని, పార్టీ కోసం నిస్వార్ధంగా గత 5 ఏళ్ల నుండి పని చేసిన ప్రతి కార్యకర్తకు జీవితాంతం రుణ పడి ఉంటానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డిలోని రాజారెడ్డి గార్డెన్ లో నిర్వహించిన నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉందాం - ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుదాం అని పిలుపునిచ్చారు. ప్రజల వద్దకు వెళ్లి పాలన చేసి కామారెడ్డి నియోజకవర్గాన్ని

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని అన్నారు. బీజేపీ పార్లమెంటు ఇంఛార్జి బద్దం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇద్దరు ఉద్దండులను ఓడించిన చరిత్ర రమణారెడ్డి తో పాటు ప్రతి బీజేపీ కార్యకర్తకు చెందుతుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ...గత ఐదేళ్లుగా చేసిన ఉద్యమాలు, నిత్యం ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం పని చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడిన ఫలితం ఇప్పుడు కామారెడ్డి లో బీజేపీ గెలుపు అని అన్నారు.

Advertisement

Next Story