తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

by Disha Web Desk 16 |
తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
X

దిశ ప్రతినిధి నిజామాబాద్: 10వ తరగతి ఫలితాల్లో తక్కువ (జిపిఏ) మార్కులు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్య యత్నం చేశారు. నవీపేట్ మండలం మహంతం గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు హరి చరణ్ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి తరగతి చదివారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 8.3 జీపీఏ రావడంతో తక్కువగా వచ్చాయని మనస్తాపంతో పొలాల్లో కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు.. బుధవారం ఉదయం గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌లో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్‌కు తరలించారు.

Next Story

Most Viewed