ఫొటోలకు ఫోజులు ఇచ్చుడు తప్ప చేసింది ఏమీ లేదు

by Disha Web Desk 15 |
ఫొటోలకు ఫోజులు ఇచ్చుడు తప్ప చేసింది ఏమీ లేదు
X

దిశ, గాంధారి : ఫొటోలకు ఫోజులు ఇచ్చుడు తప్పా ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పటివరకు ఇప్పించిన దాఖలాలు లేవని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పై ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిమిత్తం విచ్చేసిన వారికి బీఆర్​ఎస్​ నాయకులు, మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడారు.

ప్రస్తుత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఇప్పటివరకు ఏం అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని, ఆటో డ్రైవర్లు మృతి చెందితే కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేసిన దాఖలాలు లేవని అన్నారు. అంతే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఏ ఒక్కరు కూడా లబ్ధి చేకూరలేదని, ఇకనైనా జహీరాబాద్ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ దత్తత తీసుకున్న గ్రామానికి ఏమి చేయలేని బీబీ పాటిల్ కు ఓటు వేయొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed