వాహన తనిఖీల్లో రూ. లక్ష సీజ్​

by Sridhar Babu |
వాహన తనిఖీల్లో రూ. లక్ష సీజ్​
X

దిశ,నిజాంసాగర్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని బ్రాహ్మణపల్లి గేటు వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద మంగళవారం భారీ నగదు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలలో లక్ష ఒక వేయి రూపాయల నగదును పట్టుకున్నట్లు నిజాంసాగర్ ఎస్ఐ కె.సుధాకర్ తెలిపారు. హైమద్ కుమారుడు షైక్ అశ్వక్ అనే వ్యక్తి తన బొలెరో

వాహనంలో హైదరాబాద్ నుండి దెగ్లూర్ వైపునకు వెళ్తుండగా లక్ష ఒక్క వేయి రూపాయలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకు వెళ్తుండగా పట్టుకొని సీజ్ చేసినట్లు అయన తెలియజేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా డబ్బులను తరలించినట్లయితే డబ్బులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పిట్లం ఏఎస్ఐ లింబాద్రి, బాలరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story