పురుగుల మందుతో కాంట్రాక్టర్ నిరసన

by Sridhar Babu |
పురుగుల మందుతో కాంట్రాక్టర్ నిరసన
X

దిశ,నవీపేట్ : మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఓ కాంట్రాక్టర్​ పురుగుల మందుతో నిరసన చేపడ్డారు. 2020 -21 సంవత్సరం లో చేసిన పనుల బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్ తన కుటుంబంతో సహా పురుగుల మందుతో నవీపేట్ ఎంపీడీఓ ఆఫీస్ ముందు బైఠాయించారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కోస్లీ విలేజ్ లో గత మూడు సంవత్సరాల క్రితం 160 ఇంకుడు గుంతలను కాంట్రాక్టర్ శైలందర్ నిర్మించగా 77 గుంతల బిల్లులు వచ్చాయని, మిగతా 83 ఇంకుడు గుంతల బిల్లులు సుమారు నాలుగు లక్షల రూపాయలు పెండింగ్ లో ఉండగా వాటి చెల్లింపులో ఏపీఓ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. వెంటనే స్పందించిన ఎంపీడీఓ సాజిద్ అలీ బాధితుడిని సముదాయించి ఏపీఓ రాజేశ్వర్ ను వివరణ కోరారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి శనివారంలోగా నివేదికను పైఅధికారులకు అందజేస్తానని తెలిపారు.

Advertisement

Next Story