నగరంలో భారీ బైక్ ర్యాలీ.. వీధులన్నీ గులాబీమయం

by Vinod kumar |
నగరంలో భారీ బైక్ ర్యాలీ.. వీధులన్నీ గులాబీమయం
X

దిశ ప్రతినిది, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ నుంచి మొదలైన ర్యాలీ పూలాంగ్, ఆర్.ఆర్. చౌరస్తా, వర్ని చౌరస్తా, ఖిల్లా రోడ్డు, గాంధీ చౌక్, నెహ్రూ పార్కు, దేవీ రోడ్డు, శివాజి చౌక్ సంజీవయ్య కాలనీ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు సాగింది. నిజామాబాద్ నగరంలో పుర వీధుల మీదుగా జరిగిన బైక్ ర్యాలీ కార్యకర్తల్లో జోష్ నింపింది. నగర వీధులన్నీ గులాబీమయం అయ్యాయి. ఈ ర్యాలీలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవిచందర్, సత్యప్రకాష్, నగర అధ్యక్షులు సిర్ప రాజు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story