వాటర్ ట్యాంక్ లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Sridhar Babu |
వాటర్ ట్యాంక్ లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, నిజామాబాద్ రూరల్ : మాధవ నగర్ సాయిబాబా ఆలయంలోని వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందిన సంఘటన శనివారం చేసుకుంది. వివరాల్లోకి వెళితే డిచ్ పల్లి ఎస్ఐ, ఆలయ ఈ ఓ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం మాధవ నగర్ లో శుక్రవారం ఇళ్ల చుట్టూ తిరుగుతున్న గుర్తు తెలియని వ్యక్తి (40)ని గ్రామస్తులు తరిమివేయడంతో అతను ఆలయ ప్రాంగణంలో ఉన్న వాటర్ టాంక్ లో దాచుకునేందుకు వెళ్లి మృతి చెందినట్టు తెలిపారు. ఆ వ్యక్తి ఒంటిపై బట్టలు కూడా లేవని వివరించారు. వివరాలు తెలిసిన వారు డిచ్ పల్లి ఎస్ఐ 87126 59852, సీఐ 87126 59851 నంబర్ల లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Next Story