- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రక్తం చిందిస్తున్నారు.. అలా మాట్లాడొద్దు: కోమటిరెడ్డి రాజీనామాపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

X
దిశ, వెబ్డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డికి పార్టీ జాతీయ స్థాయిలో మంచి స్థానం కల్పించిందన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు రక్తం చిందిస్తున్నారని.. అలాంటి పార్టీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరి కాదన్నారు.
రాజగోపాల్ రెడ్డి జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో పార్టీలో చేరి ఇప్పుడు నిందలు వేయడం బాలేదన్నారు. వ్యక్తిగతంగా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని, తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా 3వ సారి మోదీ ప్రధాని కాబోతున్నారని ఈ సందర్భంగా లక్ష్మణ్ దీమా వ్యక్తం చేశారు.
Next Story