నెల రోజుల్లోనే రేవంత్ సర్కార్ కూలిపోతుంది: MP అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 19 |
నెల రోజుల్లోనే రేవంత్ సర్కార్ కూలిపోతుంది: MP అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని వేల్పూర్‌లో శుక్రవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి అనుకుంటే టక్కున ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్‌ను ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ నేతలే పడేసుకుంటారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరిందని, తెలంగాణతో పాటు దేశంలో అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలను కాంగ్రెస్ మోసగించిందని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో ఎంపీగా తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని, నా కంటే ముందు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత ఇప్పుడు జైలులో ఉన్నారని గుర్తు చేశారు. అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలను వదిలేస్తా తప్ప తప్పు మాత్రం చేయనని తేల్చి చెప్పారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొచ్చానని అన్నారు. రాష్ట్రం సహకరిస్తే జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఏడాదిలోపు తెరుచుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినందు వల్లే మన పనులు కావట్లేదని ఫైర్ అయ్యారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story