తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రొఫెసర్ జయశంకర్ ​చేసిన కృషి ఎనలేనిది: జేఎన్​టీయూహెచ్​వీసీ నర్సింహారెడ్డి

by Mahesh |   ( Updated:2023-08-06 12:45:06.0  )
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రొఫెసర్ జయశంకర్ ​చేసిన కృషి ఎనలేనిది: జేఎన్​టీయూహెచ్​వీసీ నర్సింహారెడ్డి
X

దిశ, కూకట్​పల్లి: తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించిన మేధావి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్​కొత్తపల్లి జయశంకర్​అని జేఎన్​టీయూహెచ్​ వీసీ కట్టా నర్సింహా రెడ్డి అన్నారు. ప్రొఫెసర్​జయశంకర్​ జయంతి సందర్భంగా వర్సిటీలో ఆదివారం జరిగిన జయంతి కార్యక్రమంలో వీసీ నర్సింహా రెడ్డి, రిజిస్ట్రార్​మంజూర్​ హుస్సేన్‌లు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రొఫెసర్ జయశంకర్​ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వీసీగా జయశంకర్ ఉన్నప్పుడు తానే విద్యార్థిగా ఉన్నానని, జయశంకర్‌ను దగ్గరనుండి చూసే అవకాశం తనకు దక్కిందని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములము కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల డైరెక్టర్‌లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed