తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలి.. గిరిజనుల రాస్తారోకో

by Nagam Mallesh |
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలి.. గిరిజనుల రాస్తారోకో
X

దిశ, కౌడిపల్లి: గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సింగమర్రి, తాళ్లగడ్డ, కిష్ట రేగడి తండాల గిరిజనులు ఆదివారం ముట్రాజ్ పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. మండలంలోని ముట్రాజ్ పల్లి పంచాయతీ పరిధిలోని సింగమర్రి, తాళ్లగడ్డ, కిష్టరేగడి, తండాలు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని విధాలుగా అర్హత కలిగి ఉన్నాయని వారు తెలిపారు. మా మూడు మండలాలపై ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తండాలను ఏర్పాటు చేయకపోవడంతో మూడు తండాలలో మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో తండాలకు చెందిన గిరిజనులు భారీగా పాల్గొన్నారు.

Next Story

Most Viewed