- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పత్తి కుంట పెద్ద చెరువులో గండి.. నీరు వృధా..
దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ మండలంలోని ర్యకల్ గ్రామం పత్తి కుంట పెద్ద చెరువు అలుగు దగ్గరలో గండి పడి నీరు వృధాగా వెళుతున్న విషయం గమనించి అక్కడికి గ్రామస్తులు చేరుకుని చెరువు గండిని మూసివేశారు. గ్రామస్తులు దీని మూలంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు దాదాపు 250 ఎకరాల నీటి పారకం ఉందని, కాబట్టి రైతుల సమస్యను వెనువెంటనే ఆర్ డి ఓ అశోక చక్రవర్తికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇచ్చారు.
తొందరలో స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీంద్ర నాయక్ ఉండి మరమ్మతులు చేపించారు. మాజీ సర్పంచ్ అంజయ్య, , మాజీ ఉప సర్పంచ్ సాయి రెడ్డి, మ్యాదరి శంకర్, ఉప్పరి పండరి, నర్సింలు , పండరి గ్రామస్తులు మరమ్మతులు చేపట్టారు. రెండు రోజుల క్రితం సిర్గాపూర్ మండల కేంద్రంలో కాకి వాగు గండి పడింది. అధికారులకు తెలిపిన ఎవరు రాకపోవడంతో గ్రామస్తులే మరమ్మత్తులు చేశారు.