- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పార్టీ మారకుండా ప్రతి ఎమ్మెల్యేకు పది కోట్లు ఇచ్చిండు : రఘనందన్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పై బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ రావు పేట మండలం కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై రఘునందన్ రావు మాట్లాడారు. డబ్బు సంచులతోనే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎంపీ టికెట్ను కొనుక్కున్నాడన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలకు తల పది కోట్ల ఇచ్చి పార్టీ మారకుండా ఆపాడన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మెదక్లో ఎగిరేది బీజేపీ జెండానేనని ధీమావ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు ప్రోటోకాల్ పాటించకుండా అవమానించిన విషయం గుర్తు చేసిన రఘునందన్ రావు అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. నేడు అదే మాదిరి బీఆర్ఎస్ నాయకులకు సిద్దిపేటలో అవమానం జరుగుతుందని, కాంగ్రెస్ నాయకులు హరీష్ రావును కాదని అభివృద్ధి పనులకు కొబ్బరి కాయలు కొడుతున్నారన్నారు.
బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త బీజేపీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు 50 మందికి ఫోన్ ద్వారా ఓటు వేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం మండలంలోని పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు రఘునందన్ రావుకు మద్దతు తెలిపారు. అంతకు ముందు రూరల్ మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేసి, కార్యకర్తలకు ఎన్నికలపై దిశానిర్ధేశం చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జిల్లెల్ల రమేష్ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నీలం దినేష్, విభీషణ్ రెడ్డి, మండల అధ్యక్షుడు పొన్నాల బాబు, తదితరులు పాల్గొన్నారు.