రీ టెండర్లు వేసే వరకు దుకాణాలు మూసి ఉంచాలి..

by Sumithra |
రీ టెండర్లు వేసే వరకు దుకాణాలు మూసి ఉంచాలి..
X

దిశ, మహమ్మదాబాద్ : మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పరిధిలోని స్కూల్ కాంప్లెక్స్ దుకాణ సముదాయాన్ని నిర్మించి 23 సంవత్సరాలవుతున్నా ఇప్పటి వరకు రీ టెండర్ వేయలేదు. ఇంకొందరు బినామీల పేర్ల పై దుకాణాలను నిర్వహిస్తున్నారని, రిటెండర్ వేయాలని గతంలోనే పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దుకాణ యజమానులకి నోటీసులు ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశంతో దుకాణాలను ఈ నెల 20న ఎంఈఓ మూయించేశారు. గురువారం దుకాణాలను యజమానులు తెరవడంతో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రీ టెండర్ వేసే వరకు దుకాణాలు ఎలా తెరుస్తారని, రీ టెండర్ వేసే వరకు మూయించి ఉంచాలని 167 వ జాతీయ రహదారి పై ధర్నా చేశారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.


Next Story