అందరికీ వైద్య సేవలు అందించడమే ధ్యేయం.. ఎమ్మెల్యే మట్టా రాగమయి దాయనంద్

by Sumithra |
అందరికీ వైద్య సేవలు అందించడమే ధ్యేయం.. ఎమ్మెల్యే మట్టా రాగమయి దాయనంద్
X

దిశ, తల్లాడ : వైద్య వృత్తి అంటే ఎంతో గొప్పది అని సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సోమవారం తల్లాడలో కాంగ్రెస్ నాయకుడు రాయల రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ మట్టా రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ వైద్యుల వద్ద బీపీ చెక్ అప్ చేయించుకొని కంటి పరిక్ష చేయించుకున్నారు. అనంతరం మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్యసేవలు అందించడమే తమ ధ్యేయమని, ప్రతి గ్రామంలో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.

జిల్లా మంత్రుల సహాయంతో సత్తుపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. తల్లాడ పిహెచ్ ని అప్ గ్రేడ్ చేసి మరింత వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా ఇలాంటి క్యాంపులు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఈ సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు వచ్చిన వైద్యులకు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story