- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తాండ్ర వినోద్ రావు సమక్షంలో బీజేపీలో చేరిన రుద్ర ప్రదీప్
దిశ, ఖమ్మం టౌన్ : బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు సమక్షంలో బీఆర్ఎస్కు చెందిన రుద్ర ప్రదీప్ తిరిగి బీజేపీలో చేరారు. శుక్రవారం రాత్రి ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి వినోద్ రావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు గతంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రదీప్కు పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రదీప్తో పాటు 24 డివిజన్ కు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రుద్ర ప్రదీప్ మాట్లాడుతూ.. గతంలో అనివార్య కారణాలవల్ల బీఆర్ఎస్లో చేరడం తనకు తన మనసుకు నచ్చకపోయినా ఆ పార్టీలో ఉండటం చాలా బాధ కలిగించిందని.. తన సొంత పార్టీలోకి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, అల్లిక అంజయ్య, డాక్టర్ శీలం పాపారావు, మోత్కూరి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు