సీతారామ ప్రాజెక్టు పనులపై మాజీ మంత్రి తుమ్మల సమీక్ష

by Shiva |
సీతారామ ప్రాజెక్టు పనులపై మాజీ మంత్రి తుమ్మల సమీక్ష
X

ఖమ్మం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ

దిశ, ఖమ్మం రూరల్: ఆయనకు ఎటువంటి పదవీ లేదు. కానీ అధికారులతో అది కూడ సెలవురోజైన ఆదివారం తన ఇంటికి పిలిపించుకుని సీతారామ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం పనుల పూరోగతి పై అధికారులకు సూచనలివ్వడంపై జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం తన సొంత గ్రామామైన గండుగులపల్లికి సీతారామ ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాసరెడ్డితో సహ పలువురు అధికారులతో పనులపై సమీక్ష నిర్వహించారు.

అదేవిధంగా పెండింగ్ పనులు జూన్​, జూలై లోపు పూర్తిచేసి జిల్లాకు సీతారామ నీళ్లందించాలన్న సీఎం కేసీఆర్​ కళను నేరవేర్చాలని సూచించారు. నిధులు కేటాయింపు, పెండింగ్ పనుల పై ఇరు జిల్లాల కలెక్టర్లతో కూడ ఫోన్​లో మాట్లాడారు. భూకేటాయింపులు,తదితర సమస్యల పై వెంటనే తుమ్మల ఇరిగేషన్​సీఎస్ రజత్కుమార్ తో ఫోన్​లో మాట్లాడారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed