పేదలకు అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలి

by Sridhar Babu |
పేదలకు అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలి
X

దిశ, భద్రాచలం టౌన్ : పేదలకు అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. వాజేడు మండలంలో ప్రభుత్వ హాస్పిటల్ ను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సందర్శించారు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందే విధంగా చుడాలని సిబ్బందిని ఆదేశించారు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయన వెంట సీనియర్ నాయకులు ప్రసాద్ బాబు, బోదబోయిన కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రాంత్, మాజీ సర్పంచ్, మండల సేవాదళ్ అధ్యక్షులు రాంబాబు, సేవాదళ్ ఉపాధ్యక్షులు లక్ష్మణ్, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి రాంబాబు, సేవాదళ్ అధికార ప్రతినిధి కోర్స సుమన్ , సేవాదళ్ గౌరవ ప్రతినిధి తాటి సమ్మయ్య, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖజవాలి, వాజేడు మండల మాజీ సర్పంచ్ ఆదినారాయణ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed