ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెండ్.. ఉత్తర్వులు జారీ...

by Sumithra |
ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెండ్.. ఉత్తర్వులు జారీ...
X

దిశ, రామడుగు : రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట దేశరాజ్ పల్లి గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శలను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. గోపాల్ రావు పేట పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ మహబూబ్ పాషా డిమాండ్ రిజిస్టర్ నకిలీ ధ్రువపత్రాలను మార్చి ఇచ్చినట్లు సమాచారం.

అదేవిధంగా దేశరాజ్ పల్లె కార్యదర్శి సంతోష్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా మోటేషన్ జారీ చేయడంతో పాటు ఒకరికి బదులు మరొకరికి ఇవ్వగా రిజిస్ట్రేషన్ సమస్య ఏర్పడి కోర్టు దాకా వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళగా ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ఎంపీడీవో కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed