- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వేసవిలో నీటి సమస్య రాకూడదు

దిశ, హుజురాబాద్ రూరల్ : ఎండలు తీవ్రతరం అవుతున్నందున నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలలోని 60 వార్డులకు, 107 గ్రామాలకు ఎలాంటి నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం హుజురాబాద్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజలకు ఎలాంటి నీటి సమస్య ఉండకూడదని ఒకవైపు కాళేశ్వరం లాంటి మహత్తరమైన ప్రాజెక్టు కట్టి మరోవైపు మిషన్ కాకతీయతో తెలంగాణ రైతులకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు.
అలాగే తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో అధిగమించాలని మిషన్ భగీరథతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు అందించి ప్రజల దాహార్తిని తీర్చిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. 60 ఏళ్ల పాలనలో నీళ్ల కోసం గోసపడ్డ తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం కట్టి దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని అన్నారు. తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేసి రైతును రాజును చేసిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ప్రజలకు నీటి సమస్య రాలేదని, ఇప్పుడు కూడా అలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు. నియోజకవర్గంలో ఏయే ప్రాంతాలలో నీటి సమస్య ఎక్కువ ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ డీఈలు బాలరాజు, శ్రీనివాస్ తో పాటు ఏఈ లు పాల్గొన్నారు.