నిబంధనలు పాటించని వేదాంతు విజ్ఞాన్.. సెలవు దినంలో కోచింగ్ సెంటర్ ఓపెన్

by Kalyani |
నిబంధనలు పాటించని వేదాంతు విజ్ఞాన్.. సెలవు దినంలో కోచింగ్ సెంటర్ ఓపెన్
X

దిశ, చైతన్య పురి : ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసి పండుగ పూట కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. లాభార్జన ధ్యేయంగా ప్రజల సెంటిమెంటును గుర్తించని కోచింగ్ సెంటర్లు మనకు కనిపిస్తున్నాయి. రంజాన్ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. రంజాన్ పండుగ కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సెలవులు ఇస్తున్నా హైదరాబాద్ నడిబొడ్డున కొత్తపేట ఏరియాలో ఉన్న కోచింగ్ సెంటర్లు మాత్రం విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న తతంగం సోమవారం దిశ కంటపడింది.

ఎక్కడ..

సరూర్ నగర్ డివిజన్ పరిధిలోకి వచ్చే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కన హుడా కాలనీ రోహిత్ గౌడ్ ఎస్టేట్ లోని ఫ్యాషన్ ఫ్యాక్టరీ బిల్డింగ్ నాలుగో అంతస్తులో ప్లాట్ నంబర్ 106 లో గత కొన్నేళ్లుగా వేదాంతు విజ్ఞాన్ పేరిట కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. విజ్ఞాన్ కాలేజ్ యాజమాన్యంతో కుమ్మక్కై ఇక్కడ జేఈఈ అడ్వాన్స్ డ్, నీట్, ఎంసెట్ లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 10 క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేయగా 400 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్ధి నుండి సుమారు ఒక లక్ష రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నా రు. ఇష్టానుసారంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న పర్యవేక్షించే విద్యాశాఖ అధికారులు మిన్నకుండి పోవడం వీరికి కలిసి వచ్చింది. రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రపంచంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవు ఇస్తున్న ఇక్కడ కోచింగ్ సెంటర్ మీరు మాత్రం విద్యార్థులకు ఎలాంటి సెలవు ఇవ్వకుండా తరగతులు నడిపిస్తున్నారు.

బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం..

విద్యార్థిని విద్యార్థులకు సమయానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా జాయిన్ చేసినప్పుడే ప్రారంభ దశలో బజాజ్ ఫైనాన్స్ వెసులుబాటు ఉందని పేరెంట్స్ కు చెబుతున్నారు. ఆధార్ పాన్ కార్డులతో బజాజ్ ఫైనాన్స్ ఇప్పించి వేదాంత విజ్ఞాన్ కళాశాల యాజమాన్యం ఒకేసారి ఫీజు తీసేసుకుంటున్నారు. సంస్థకు ఆదాయం పేరెంటుకు ఈఎంఐ.

పేరెంట్స్ ఒత్తిడితోనే..

ఈరోజు సెలవు దినమని మాకు కూడా తెలుసు. మాది తప్పే. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతోనే నేడు సోమవారం తరగతులు నిర్వహిస్తున్నామని, కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మీపూజ, అకాడమిక్ అడ్మిన్ హెడ్ యతీష్ తెలిపారు. వాస్తవమా కాదా అని తెలుసుకోవడానికి తల్లిదండ్రులతో మాట్లాడించాలని దిశ ప్రతినిధి కోరగా నీళ్లు నమిలారు. సంబంధిత అధికారులు సంస్థపై చర్యలు తీసుకొని సీజ్ చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story

Most Viewed