ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి‌కి బ్రహ్మరథం పట్టిన మహిళలు

by Disha Web Desk 12 |
ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి‌కి బ్రహ్మరథం పట్టిన మహిళలు
X

దిశ, జూబ్లిహిల్స్: సికింద్రాబాద్ ఎంపీగా తనను ఆశీర్వదించాలని, దేశం కోసం మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అమీర్పేట్ బాట షో రూమ్ వద్ద ప్రారంభమైన ప్రచార యాత్ర.. ఎల్లారెడ్డి గూడ, యూసఫ్ గూడ బస్తీ, వెంకటగిరి, కార్మిక నగర్ మీదుగా మోతీ నగర్ ఎక్స్ రోడ్, కళ్యాణ్ నగర్, కృష్ణ కాంత్ పార్క్, విజయ గ్రౌండ్స్, ఎల్‌ఎన్ నగర్ వరకు బైక్ ర్యాలీ తో ప్రచారం కొనసాగింది. ప్రచారంలో మహిళలు కిషన్ రెడ్డికి మంగళ హారతులతో బ్రహ్మరథం పలుకుతూ స్వాగతం పలికారు. యువత పెద్ద ఎత్తున తరలివచ్చి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రచారంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఎంపీగా తనను ఆశీర్వదించాలని, దేశం కోసం మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని ఆయన కోరారు.

మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమే..

రాష్ట్రంలో గత పదేండ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ‘‘దేశం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం బీజేపీకి ఓటు వేయండి. మోదీని మరోసారి ప్రధానిని చేద్దాం. సికింద్రాబాద్ ఎంపీగా నేను చేసిన అభివృద్ధి మీ ముందు పెట్టాను. నన్ను ఎంపీగా మరోసారి ఆశీర్వదించండి. నియోజకవర్గ అభివృద్ధిగా కృషి చేస్తాను. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేసినా వృథానే. ఎందుకంటే కేంద్రంలో మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమే”అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షురాలు జూటూరు కీర్తి రెడ్డి , జూబ్లిహిల్స్ నాయకులు చిట్టబోయిన సందీప్ యాదవ్ , బీజేపీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు డా.పద్మ వీరపనేని , లంకాల దీపక్ రెడ్డి , కిలారీ మనోహర్ , విజయ్ కుమార్ , అనంతలక్ష్మి , కొత్త వెంకటేష్ ముదిరాజ్, రూప తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed