- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మేము శాంక్షన్ చేయించిన పనులకు.. నువ్వు కొబ్బరికాయ కొడ్తవా ?

దిశ, వనస్థలిపురం : వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీ ఫేజ్–2 లో తాను శాంక్షన్చేయించిన యూజీడీ పనులకు, తనకు సమాచారం లేకుండానే ఎమ్మెల్యే సుధీర్రెడ్డి శంకుస్థాపన చేయడమేమిటని డివిజన్కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వెంకటేశ్వర్రెడ్డి నివాసంలో కాంగ్రెస్పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ కుట్ల నర్సింహ్మ యాదవ్, వ్యవసాయ మార్కెట్కమిటీ డైరెక్టర్లు నేలపాటి రామారావు, అశోక్గౌడ్, నర్సింహ్మ గౌడ్, సాయి కిరణ్లతో కలిసి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనస్థలిపురం డివిజన్లోని ఎఫ్సీఐ కాలనీ నుంచి ఆర్టీసీ కాలనీ వరకు యూజీడీ పైప్లైన్నిర్మాణానికి కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మధుయాష్కీ గౌడ్సహకారంతో వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డికి విన్నవించి నా లెటర్ ప్యాడ్మీద రూ. 55 లక్షలు శాంక్షన్ చేయించానన్నారు.
త్వరలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబును పిలిచి డివిజన్లో సుమారు రూ. 12 కోట్ల అభివృద్ధి పనులకు ఒకేసారి శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. కానీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అభద్రతా భావంతో.. దిగజారుడు రాజకీయాలు చేస్తూ.. కనీసం ప్రోటోకాల్పాటించకుండానే కొబ్బరి కాయలు కొట్టడం దుర్మార్గమన్నారు. సుధీర్ రెడ్డి అన్ని డివిజన్లలో వలే వనస్థలిపురంలో రాజకీయం చేస్తా అంటే ఊరుకునేది లేదని వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆయన చిల్లర రాజకీయాలు మానుకుని, హుందాగా వ్యవహరించాలని వెంకటేశ్వర్రెడ్డి హితవు పలికారు. రేపటి నుంచి ఆయన బండారాలు ఒక్కొక్కటిగా బయటపెడతామని హెచ్చరించారు.