మేము శాంక్షన్​ చేయించిన పనులకు.. నువ్వు కొబ్బరికాయ కొడ్తవా ?

by Sumithra |
మేము శాంక్షన్​ చేయించిన పనులకు.. నువ్వు కొబ్బరికాయ కొడ్తవా ?
X

దిశ, వనస్థలిపురం : వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఎఫ్​సీఐ కాలనీ ఫేజ్​–2 లో తాను శాంక్షన్​చేయించిన యూజీడీ పనులకు, తనకు సమాచారం లేకుండానే ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి శంకుస్థాపన చేయడమేమిటని డివిజన్​కార్పొరేటర్​ రాగుల వెంకటేశ్వర్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వెంకటేశ్వర్​రెడ్డి నివాసంలో కాంగ్రెస్​పార్టీ డివిజన్​ ప్రెసిడెంట్​ కుట్ల నర్సింహ్మ యాదవ్​, వ్యవసాయ మార్కెట్​కమిటీ డైరెక్టర్లు నేలపాటి రామారావు, అశోక్​గౌడ్​, నర్సింహ్మ గౌడ్​, సాయి కిరణ్​లతో కలిసి ప్రెస్​మీట్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనస్థలిపురం డివిజన్లోని ఎఫ్​సీఐ కాలనీ నుంచి ఆర్టీసీ కాలనీ వరకు యూజీడీ పైప్​లైన్​నిర్మాణానికి కాంగ్రెస్​పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మధుయాష్కీ గౌడ్​సహకారంతో వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డికి విన్నవించి నా లెటర్ ​ప్యాడ్​మీద రూ. 55 లక్షలు శాంక్షన్ ​చేయించానన్నారు.

త్వరలో జిల్లా ఇన్​ఛార్జి మంత్రి శ్రీధర్​బాబును పిలిచి డివిజన్​లో సుమారు రూ. 12 కోట్ల అభివృద్ధి పనులకు ఒకేసారి శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. కానీ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి అభద్రతా భావంతో.. దిగజారుడు రాజకీయాలు చేస్తూ.. కనీసం ప్రోటోకాల్​పాటించకుండానే కొబ్బరి కాయలు కొట్టడం దుర్మార్గమన్నారు. సుధీర్​ రెడ్డి అన్ని డివిజన్లలో వలే వనస్థలిపురంలో రాజకీయం చేస్తా అంటే ఊరుకునేది లేదని వెంకటేశ్వర్​ రెడ్డి మండిపడ్డారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆయన చిల్లర రాజకీయాలు మానుకుని, హుందాగా వ్యవహరించాలని వెంకటేశ్వర్​రెడ్డి హితవు పలికారు. రేపటి నుంచి ఆయన బండారాలు ఒక్కొక్కటిగా బయటపెడతామని హెచ్చరించారు.

Next Story

Most Viewed