HYD : బషీర్‌బాగ్ కూడలి వద్ద విద్యార్థినుల ఆందోళన.. కారణమిదే..!

by Rajesh |
HYD : బషీర్‌బాగ్ కూడలి వద్ద విద్యార్థినుల ఆందోళన.. కారణమిదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బషీర్ బాగ్ కూడలి వద్ద విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. నిజాం కాలేజీలో నిర్మించిన హాస్టళ్లను యూజీ విద్యార్థినులకే కేటాయించాలని ఈ సందర్భంగా స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. మహిళా హాస్టల్‌ను యూజీ వారికే కేటాయించాలని విద్యార్థినులు కోరారు. గర్ల్స్ హాస్టల్లో సీట్లు పీజీ విద్యార్థినులకు కాకుండా..యూజీ విద్యార్థనులకు కేటాయించాలని కోరారు. విద్యార్థినుల ఆందోళనతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసుల వాహనాల్లో తరలించారు.

Advertisement

Next Story

Most Viewed