CPIM: టన్నెల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలి

by Gantepaka Srikanth |
CPIM: టన్నెల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ప్రాంతంలోని SLBC సొరంగ పనుల్లో భాగంగా టన్నెల్ కూలి ఎనిమిది మంది సొరగంలో చిక్కుకున్న ఘటనపై విచారణ జరపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ శనివారం ఒక ప్రటనలో డిమాండ్​చేశారు. గత వారం రోజులుగా నీరు లీకేజీ అవుతున్నా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం టన్నెల్​పనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే పనులు చేపట్టిందన్నారు. ఈ ఘటన పట్ల సీపీఐ (ఎం ) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్ర్భాంతిని తెలియజేస్తూ ఈ ఘటననై సమగ్ర విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని జాన్​వెస్లీ డిమాండ్​చేశారు. అంతే కాకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, టన్నెల్‌లో చిక్కుకున్న వారి నందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్​చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed