- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజృంభిస్తున్న కరోనా.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మొదలైన కరోనా పరీక్షలు
by samatah |

X
దిశ, వెబ్డెస్క్ : ప్రపంచ దేశాలనే గజగజలాడించిన కరోనా విజృంభణ మళ్లీ మొదలవుతుంది.తగ్గిపోయింది అని సంతోషంగా ఉండేలోపు మళ్లీ కేసులు పెరగడం కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. వరుసగా రెండో రోజు కేసులు 3 వేల మార్కును దాటింది. ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 700 కేసులు నమోదయ్యాయి.
దీంతో కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రయాణకులను పరీక్షించేందుకు థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వందమంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు
Next Story