CM Revanth Reddy : అంకాపూర్ చికెన్ తినిపిస్తావా.. రైతుతో CM రేవంత్ రెడ్డి సరదా సంభాషణ

by Rajesh |
CM Revanth Reddy : అంకాపూర్ చికెన్ తినిపిస్తావా.. రైతుతో CM రేవంత్ రెడ్డి సరదా సంభాషణ
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కారు రుణమాఫీ ప్రక్రియను గురువారం ప్రారంభించింది. రూ.లక్షలోపు బాకీ పడిన మొత్తం 11,08,171 మంది రైతులకు చెల్లించేందుకు గాను మొదటి విడతలో ప్రభుత్వం రూ.6,098 వేల కోట్లను సర్కారు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, గురువారం రైతు రుణమాఫీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఓ నిజామాబాద్ రైతుకు మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. ఒక్క నిజామాబాద్ జిల్లాకే రూ.226 కోట్లను రైతు రుణమాఫీ కింద జమ చేస్తున్నామని సీఎం రేవంత్ రైతుతో అన్నారు. దీనికి రైతు బదులిస్తూ మా జిల్లాలో పొలాల్లో రైతులు నాట్లు వేస్తూ స్వీట్లు పంచుకుంటున్నారని తెలిపారు. పదేళ్ల తర్వాత రైతులు గంతేస్తూ ఆనందంగా ఉన్నారని సీఎంకు తెలిపారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి బదులిస్తూ.. రుణమాఫీ చేసినందుకు అంకాపూర్ చికెన్ తినిపిస్తావా లేదా మరి నవ్వుతూ అన్నారు. దీనికి రైతు బదులిస్తూ తప్పకుండా తినిపిస్తా అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed