BREAKING: రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ నయా మోసం: ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
BREAKING: రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ నయా మోసం: ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతు రుణామాఫీ పేరుతో రేవంత్ సర్కార్ నయా మోసానికి తెర లేపిందని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లడుతూ.. ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఎగ్గొట్టి.. ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ అంటూ ఊరూరా హడావుడి చేస్తోందని మండిపడ్డారు. రూ.లక్ష లోపు తీసుకున్న రుణాల్లో అందులో సంగం మందికి కూడా రుణమాఫీ కాలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ముప్పుతిప్పలు పడుతోందని అన్నారు.

ఇక గత్యంతరం లేక ఖరీఫ్ రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణ మాఫీ అంటూ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క మహబూబ్‌నగర్ పరిధిలోని ఒక్క డీసీసీ బ్యాంక్‌లో 68,495 మంది రైతులు అప్పులు తీసుకున్నాని తెలిపారు. అందులో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు 51,415 మంది ఉన్నారని పేర్కొన్నారు. వారిలో ప్రభుత్వం 20,130 మందికి మాత్రమే రుణమాఫీ చేసిందంటూ బట్టబయలు చేశారు. దీంతో ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ.. ప్రజలను నిండా మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. పైగా రుణమాఫీ మొత్తం చేశామంటూ సీఎంతో సహా మంత్రులు మీడియా ముందు చెప్పడం హాస్యా్స్పదంగాఉందని డీకే అరుణ అన్నారు.



Next Story