బ్రేకింగ్ : ఎమ్మెల్సీ కవితకు ఈడీ బిగ్ షాక్

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-18 08:43:45.0  )
బ్రేకింగ్ : ఎమ్మెల్సీ కవితకు ఈడీ బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. విచారణకు హాజరు కాలేనని తన ప్రతినిధి, న్యాయవాది‌తో కవిత పంపిన సమాచారంతో ఈడీ సంతృప్తి చెందలేదు. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందని.. ఈడీ విచారణకు హాజరు కాలేనని కవిత తెలిపింది. కవిత పిటిషన్‌పై ఈ నెల 24న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కాగా కవిత విజ్ఞప్తిని ఈడీ డైరెక్టర్ అంగీకరించకపోవడం సంచలనంగా మారింది.

లిక్కర్ స్కాం కేసులో నేడు ఉదయం 11 గంటలకు ఈడీ ఎదుట కవిత మరోసారి హాజరు కావాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. ఈ మేరకు ఈడీ ఆఫీస్‌కు సమాచారాన్ని ఎమ్మెల్సీ కవిత పంపారు. మరో రోజు విచారణ తేదీ నిర్ణయించాలని కవిత ఈడీని అభ్యర్థించారు. తాజా పరిణామాలతో లిక్కర్ స్కాం కేసులో ఏం జరగబోతోందోనన్న టెన్షన్ నెలకొంది.

Advertisement
Next Story

Most Viewed