- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎస్ఐకి కత్తి చూపించి, దాడి చేసి దోపిడీ..నలుగురు అరెస్ట్
దిశ, క్రైమ్ బ్యూరో: రైలులో ఒంటరిగా ఉన్న సీఆర్పీఎఫ్ ఎస్ఐ ని దోచుకున్న నలుగురు సభ్యుల ముఠా ను గురువారం సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.... గురువారం తెల్లవారుజామున మలక్పేట్ రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.నిందితులను ఇబ్రహీం పఠాన్, తౌఫిక్, ముకీత్, అనసుద్దీన్లుగా గుర్తించారు. ఈ నలుగురికి పాత నేర చరిత్ర ఉంది.ప్రశ్నించినప్పుడు గత నెల 26 వ తేదిన అర్ధరాత్రి దాటిన తర్వాత ఇబ్రహీం ముగ్గురిని యాకత్ పురా రైల్వే స్టేషన్ లో వదిలి పెట్టాడు. ముగ్గురు అదే సమయంలో వచ్చిన ఎంఎంటీఎస్ రైలు లోకి ఎక్కారు. ఒంటరిగా ఉన్న సీఆర్పీఎఫ్ ఎస్ఐ దగ్గరకు వెళ్లి కత్తి చూపించి బేదిరించారు. అతను తిరగబడడం తో కత్తి తో చేతిఫై గాయం చేశారు. మేడలో ఉన్న బంగారం, మొబైల్ ఫోన్ లు, నగదును లాక్కొని పారిపోయారని విచారణలో తెలిసింది. దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకుని 4 గురిని అరెస్ట్ చేశారు.