- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ పని ఎలాగూ చేయరు.. పోనీ ఇలా చేయండి: సోమిరెడ్డి

దిశ ఏపీ బ్యూరో: పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల అంశంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చుక్కెదురైన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా సలహాలు ఇచ్చారు.. ఇంతకీ ఆయన ట్విట్టర్లో ఏమన్నారంటే.. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేయాలన్న సలహా ఇచ్చింది బొత్సనా? లేక బుగ్గనా? అంటూ గతంలోనే తాను అడిగానని గుర్తు చేస్తూ… ‘ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులేయడంపై హైకోర్టు చీవాట్లు పెట్టినప్పుడే మీ పిచ్చి పరాకాష్టకు చేరుకుందని చెప్పాము. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మొట్టికాయలు వేసింది. నాలుగు వారాల్లోగా రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది. విలువలు పాటించే ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే రాజీనామా చేస్తారు. మీరు అలాంటి సంప్రదాయాలు పాటించే వారు కాదు కాబట్టి… ఇకనైనా న్యాయ, రాజ్యాంగ వ్యవస్థలతో క్రీడావినోదం మానుకోవాలని జగన్ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నా’ అని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.