రాజేంద్రనగర్‌లో శ్రీనివాస్ మృతి

by  |
రాజేంద్రనగర్‌లో శ్రీనివాస్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తి తప్ప తాగి చేసిన ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం నగరంలోని రాజేంద్రనగర్ లో మద్యం సేవించి కారుతో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

అనంతరం నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. మృతుడు శ్రీనివాస్ గా గుర్తించారు.


Next Story

Most Viewed