నాలుగో టీ20లో టాస్ గెలిచిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్

by Mahesh |
నాలుగో టీ20లో టాస్ గెలిచిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ ప్రస్తుతం జింబాబ్వే టూర్ లో భాగంగా ఈ రోజు నాలుగో టీ20 మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతుంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో జింబాబ్వే జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచులో భారత జట్టులోకి కొత్త ప్లేయర్ వచ్చాడు. ఐపీఎల్ 2024లో చెన్నై తరుఫున ఆడి సత్తా చాటీని తుషార్ దేశ్‌పాండే ఈ రోజు మ్యాచుల్లో జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే ఐదు టీ20ల సిరీస్ లో మొదటి మ్యాచులో ఓడిపోయిన భారత జట్టు తర్వాతి రెండు మ్యాచుల్లోను అలవోకగా గెలిచి 1-2 లీడ్ లో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే టీ20 సిరీస్ ను కైవసం చేసుకోనుండగా.. జింబాబ్వే గెలిస్తే.. సిరీస్ ను 2-2తో సమం చేయనుంది. మరీ ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

జింబాబ్వే (ప్లేయింగ్ XI): వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(సి), జోనాథన్ కాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(w), రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (సి), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (w), రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్



Next Story