బంగ్లా జట్టును తక్కువ అంచనా వేయొద్దు : రోహిత్ సేనకు సునీల్ గవాస్కర్ సూచన

by Harish |
బంగ్లా జట్టును తక్కువ అంచనా వేయొద్దు : రోహిత్ సేనకు సునీల్ గవాస్కర్ సూచన
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సన్నద్ధమవుతున్న టీమ్ ఇండియాకు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లా జట్టును తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించాడు. ‘పాక్ గడ్డపైనే పాకిస్తాన్‌ను వారు రెండు టెస్టుల్లో ఓడించి తమ సత్తా ఏంటో చూపించారు. రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు కూడా భారత్‌కు గట్టిపోటీనిచ్చారు. ఇప్పుడు పాక్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో భారత్‌ను కూడా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు.’ అని తెలిపాడు.

అలాగే, బంగ్లా జట్టులో కొందరు అత్యుత్తమ ప్లేయర్లు ఉన్నారని, కొత్త ఆటగాళ్లలోనూ ప్రతిభావంతులు ఉన్నారని చెప్పాడు. పాక్‌పై విజయంతో బంగ్లాను తక్కువ అంచనా వేయొద్దని ప్రతి జట్టుకు తెలిసింది. కాబట్టి, ఈ సిరీస్ ఆసక్తికరంగా జరుగుతుంది.’ అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇటీవల పాక్‌లో పర్యటించిన బంగ్లా జట్టు టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 19 నుంచి చెన్నయ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుంది.

Advertisement

Next Story

Most Viewed