తన నివాసంలో చెత్తను తొలగించిన స్పీకర్

by Shyam |
తన నివాసంలో చెత్తను తొలగించిన స్పీకర్
X

మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ‘డ్రై డే’ లో భాగంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో చెత్త, నీటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం పది గంటలకు.. పది నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో పారిశుద్ధ్య పనులు నిర్వహించుకోవాలని కోరారు. ఇంటి ఆవరణలో వ్యర్థాల తొలగింపు, కుండీల్లో నీటి తొలగింపు వంటి తదితర పనులు చేపట్టాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed