వామపక్షాలు చైనావోళ్లు : సోమువీర్రాజు

by Anukaran |
వామపక్షాలు చైనావోళ్లు : సోమువీర్రాజు
X

దిశ, వెబ్‌డెస్క్ : వామపక్ష పార్టీ నాయకులు చైనావోళ్లని, చైనా దేశం డబ్బులిస్తే ఇండియాలో వారి కోసం పనిచేస్తున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా, ఏపీలో తెలుగుదేశం పార్టీకి కూడా ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, చంద్రబాబు పైసలిస్తే వారి తరపున చిలక పలుకులు పలుకుతున్నారని ఘాటుగా విమర్శించారు.

పోలవరం అంచనా వ్యయాన్ని కేంద్రం ప్రభుత్వం తగ్గించడంతో.. ప్రాజెక్టు ఎత్తును ఏపీ ప్రభుత్వం తగ్గిస్తోందని టీడీపీ, వామపక్ష పార్టీలు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నాయి. సోమవారం వామపక్షాలు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు టీడీపీ, వామపక్షాలపై విరుచుక పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed