కేసీఆర్ రాకతో సిద్దిపేట దశ,దిశ మారింది:మంత్రి హరీష్ రావు

by Shyam |   ( Updated:2021-12-24 07:14:33.0  )
harish rao
X

దిశ సిద్దిపేట: తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంలగా ఏర్పడడం , రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించడం దీంతో సిద్దిపేట దశ, దిశ మారిందనీ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట శివారు నాగులబండ వద్ద నూతనంగా నిర్మించిన హరిత త్రీ స్టార్ టూరిజం హోటల్ ను టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ… ఉత్తర తెలంగాణ నుంచి రాకపోకలు సాగించే వారికి ఉపయోగపడేలా రెస్టారెంట్ ఉపయోగపడుతుందని తెలిపారు.

సిద్దిపేట రాజీవ్ రహదారి పక్కన ఉన్న ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల పరిధిలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలను గుర్తించి సిద్దిపేట ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా దృష్టి లోపల సవరణకు కృషి చేయాలని కోరారు. టూరిజం హోటల్ పక్కనే వందలాది మందికి ఉపాధి నిచ్చే ఐటీ టవర్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు. టూరిజం హోటల్ ముందు ఆక్సిజన్ పార్క్ 200 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. విద్య, వైద్యం రంగాలలో మౌలిక సదుపాయాలు పెంపొందిస్తున్నామని మంత్రి వివరించారు.

హనుమకొండ – సిద్దిపేట, జనగామ – చేర్యాల – సిద్దిపేట, దుద్దేడ – సిరిసిల్ల వరకు జాతీయ రహదారులుగా ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజా అవసరాలు ఒక్కొక్కటిగా తీర్చుతున్నామని, అన్ని రంగాలలో గుణాత్మక మార్పులు సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలుస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు వారి భాగస్వామ్యంతో నాడు రాష్ట్రం కోసం నేడు అభివృద్ధికి ఉద్యమిస్తున్నాం అన్నారు. సిద్దిపేట జిల్లాకు 33 జాతీయ రహదారి, రాష్ట్ర స్థాయిలో అవార్డుల ను సొంతం చేసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దుద్దేడ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రూ.100 కోట్లతో రంగనాయక సాగర్‌ను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… స్వరాష్ట్రం తెలంగాణలో సిద్దిపేట టూరిజం స్పాట్ గా మారిందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో భవిష్యత్తులో స్థిర నివాస కేంద్రంగా సిద్దిపేట అవతరించిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed