- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారీ లాభాలు నమోదు చేసిన మార్కెట్లు

దిశ, సెంట్రల్ డెస్క్: అంతర్జాతీయంగా మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు భారీగా లాభాలను నమోదు చేశాయి. వరుస నష్టాల నుంచి బుధవారం ఈక్విటీ మార్కెట్లు కోలుకున్నాయి. ఉదయం ఊగిసలాటతో మొదలైన మార్కెట్లు నెమ్మదిగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సూచీలు జోరందుకోవడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 498.65 పాయింట్లు లాభపడి 35,414 వద్ద ముగియగా, నిఫ్టీ 127.95 పాయింట్ల లాభంతో 10,430 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్లో యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ ఐటీసీ ఇండస్ఇండ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు అధిక లాభాల్లో ట్రేడవ్వగా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా సాధారణ లాభాలను నమోదు చేశాయి. ఎన్టీపీసీ, నెస్లె ఇండియా, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో కదలాడాయి.