స్వల్పంగా లాభపడ్డ మార్కెట్లు!

by Harish |
స్వల్పంగా లాభపడ్డ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: గత వారంతంలో నష్టాలను నమోదు చేసిన మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం నుంచే లాభాల్లో ట్రేడయిన సూచీలు మార్కెట్లు ముగిసే సమయానికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈ వారంలో కంపెనీలు త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో మదుపర్లు వాటిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మిడ్ సెషన్‌కు ముందు మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో 400 పైగా లాభపడిన మార్కెట్లు తర్వాత వెనకడుగు వేశాయి. మిడ్ సెషం తర్వాత మళ్లీ అమ్మకాలు పెరగడంతో నష్టాలు, లాభాల మధ్య ఊగిసలాడి చివరి గంటలో లాభాలను నమోదు చేసింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 96.36 పాయింట్లు లాభపడి 36,693 వద్ద ముగియగా, నిఫ్టీ 47.15 పాయింట్ల లాభంతో 10,815 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, సన్‌ఫార్మా, టాటాస్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, బజాజ్ ఫినాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. నిఫ్టీలో ముఖ్యంగా ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు లాభపడగా, రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు నష్టపోయాయి.

Advertisement

Next Story