Viral news: జైల్లో మాజీ ఎంపీ.. ఎన్నికల బరిలో తెలంగాణకు చెందిన మూడో భార్య

by Disha Web Desk 3 |
Viral news: జైల్లో  మాజీ ఎంపీ.. ఎన్నికల బరిలో తెలంగాణకు చెందిన మూడో భార్య
X

దిశ వెబ్ డెస్క్: తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి యూపీ ఎన్నికల బరిలో దిగారు. కాగా ఆమె మాజీ మంత్రి ధనుజయ్ సింగ్ మూడో భార్య. ఆయన గతంలో యూపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే పలు కేసుల్లో ఆయనకు శిక్షపడడంతో జైలుకి వెళ్లారు. దీనితో ఆయన మూడవ భార్య శ్రీకళారెడ్డి యూపీలోని జోన్‌పూర్ నుండి BSP MPఅభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

కాగా శ్రీకళారెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి కూడా గతంలో హుజూర్‌నగర్ నుండి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అలానే ఆమె తల్లి లలితారెడ్డి సర్పంచ్‌గా సేవలందించారు. కాగా నిప్పో బ్యాటరీల కంపెనీ ఈ కుటుంబానికి సంబంధించిందే కావడం విశేషం. ఇక ప్రస్తుతం శ్రీకళారెడ్డి పేరుపై రూ. 780 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

Next Story