- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
High Court: టీడీపీ పిటీషన్పై విచారణ వాయిదా.. తదుపరి విచారణ ఎప్పుడంటే..?!
దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. రానున్న ఎన్నికల్లో అధికారం చేజారకుండా చూసుకునేందుకు వైసీపీ ఆచితూచి అడుగులేస్తుంటే.. రానున్న ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రతిపక్షాలు వ్యూహ రచణ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు జనసేనకు తలనొప్పిగా మారారు.
వివరాల్లోకి వెళ్తే.. జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాస్ అనే విషయం అందరికీ తెలిసిందే. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైన ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడ ఎన్నికల కమిషన్ గాజుగ్లాస్ గుర్తును కేటాయించింది. దీనితో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అనుకుని స్వతంత్రం అభ్యర్థులకు ఓటు వేశా అవకాశం ఉందని కూటమి పక్షాలైన బీజేపీ, టీడీపీ, జనసేన ఆందోళన చెందుతున్నాయి.
ఈ క్రమంలో టీడీపీ గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి తప్ప వేరెవరికీ కేటాయించకూడదని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా టీడీపీ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికల ప్రక్రియ ఏ దశలో ఉందో చెప్పాలని ఈసీని ఆదేశించింది. అలానే తదుపరి విచారణను రోజు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది.