మిక్సింగ్ బూడిద కూలి ఒకరి మృతి

by Sridhar Babu |

దిశ, కొత్తగూడెం: మిక్సింగ్ బూడిద కూలి ఒకరి మృతిచెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామంలో కె.ఆర్.కె క్రషర్ లో మంగళవారం మిక్సింగ్ బూడిదను లారీలోకి లోడ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ మిక్సింగ్ బూడిద కుప్ప మీద పడి బైరెడ్డి మధుసూదన్ రెడ్డి(41) అనే వ్యక్తి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు అశ్వాపురం మండలం మెుండికుంట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed