- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ముందు సీట్ను గట్టిగా పట్టుకున్నాం’
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్వేపై నుంచి పక్కకు జారి లోయలో పడటంతో విమానం రెండు ముక్కలైంది. విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో పది మంది చిన్నారులు.. ఇద్దరు పైలట్లు, అయిదుగురు క్యాబిన్ క్రూ ఉన్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లతో సహా 19 మంది దుర్మరణం చెందారు. మరో 127 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘‘ ఇది చాలా పెద్ద ప్రమాదం. విమానం కూలుతున్నప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ముందు సీట్లను గట్టిగా పట్టుకున్నాం. విమానం ఒక్కసారిగా కూలడంతో రెండు ముక్కలైంది. ’’ అని ఓ ప్రయాణికుడు వెల్లడించాడు.
Next Story