నేడే నీట్ : అభ్యర్థులకు కొత్త నిబంధనలు 

by  |
నేడే నీట్ : అభ్యర్థులకు కొత్త నిబంధనలు 
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఈరోజే నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షల 67 వేలమంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఏపీ నుండి 61,892 మంది తెలంగాణ నుండి 55,800 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

కోవిడ్ నేపథ్యంలో ఈసారి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు అధికారులు. గంటన్నర ముందే ఎగ్జామ్ సెంటర్ కు అభ్యర్థులు చేరుకోవాలి. తనిఖీల తర్వాతే ఎగ్జామ్ సెంటర్ కి అనుమతి ఉంటుంది. విద్యార్థుల డ్రెస్ కోడ్ పైనా మార్గదర్శకాలు విడుదల చేశారు. స్లిప్పర్స్, శాండిల్స్ మాత్రమే వేసుకోవాలి. అడ్మిట్ కార్డు తో పాటు వ్యాలిడ్ ప్రూఫ్ తీసుకురావాలని ఎన్టీయే ఆదేశించింది.

Read Also…

TSలో ఇవాళ 2,216 కేసులు..!


Next Story

Most Viewed