- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలి: విప్రో!

బెంగళూరు: దేశీయ నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులందరూ ఈ నెల నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు కంపెనీ ఉద్యోగుల ఇష్టానికి అనుగుణంగా హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరిస్తోంది. ఈ విధానంలో ఉద్యోగులు తమకు నచ్చిన సమయంలో ఆఫీసులో పనిచేసుకోవచ్చు. తాజాగా దీన్ని రద్దు చేస్తూ తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చెసింది. ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా కంపెనీ సమాచారం అందజేసింది. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని విప్రో పేర్కొంది. ఒకవేళ ఎవరైన ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కంపెనీ పాలసీ నిబంధనల ఆధారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఉద్యోగులు ఆఫీసులకు రావడం మూలంగా టీమ్ స్పిరిట్, తోటి ఉద్యోగులతో సంబంధాల ద్వారా ఉత్పాదతకను పెంచుతాయని కంపెనీ భావిస్తోంది.