- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బిహార్లో విషాదం..పిడుగు పాటుకు 12 మంది మృతి
by vinod kumar |
X
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత 24 గంటల్లో పిడుగుపాటుకు గురై12 మంది మృతి చెందినట్టు అధికారులు సోమవారం ప్రకటించారు. దీంతో ఈనెల 1 నుంచి పిడుగుపాటు వల్ల మృతి చెందిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ ఘటనలపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. మరణించిన వారికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసే సూచనలను పాటించాలని కోరారు. కాగా, 2022లో రాష్ట్రంలో పిడుగులు పడి 400 మందికి పైగా మరణించడం గమనార్హం. అలాగే 2018-22 మధ్య రాష్ట్రంలో వివిధ ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల కారణంగా 9,687 మంది మరణించినట్టు ఓ నివేదిక పేర్కొంది.
Advertisement
Next Story